అట్టహాసంగా యువ ఉత్సవ్
నిజామాబాద్నాగారం: నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ్ పోటీలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి యువ ఉత్సవ్లో చిత్రలేఖనం, ఉపన్యాసం, గేయ రచన, ఫొటోగ్రఫీ, బృంద నృత్యం అంశాల మీద పోటీలు జరిగాయి. 172 మంది పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా ప్రధాన నాయమూర్తి కుంచాల సునీత హాజరయ్యారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాక్సింగ్ కోచ్ శంషోద్దీన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, యువజన క్రీడల అధికారి ముత్తెన్న, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్, ఎన్వైకే కోఆర్డినేటర్ బెల్లాల్ శైలీ పాల్గొన్నారు.