కడియం: శ్రావణమాసం రావడంతోనే మండలంలోని కడియపులంక పూవుల మార్కెట్కు కొత్త కళ సంతరించుకుంది. జనవరి నుంచి అంతంత మాత్రంగా సాగిన క్రయ విక్రయాలతో కళతప్పిన ఈ మార్కెట్ శ్రావణం నుంచి ప్రారంభమైన శుభ ముహూర్తాలతో సందడి నెలకొంది. శుక్రవారం వరలక్ష్మీవ్రతం నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారులతో స్థానిక మార్కెట్లో రద్దీ నెలకొంది.
దిగుబడి లేక దిగుమతి..
సీజన్ ప్రారంభమైనప్పటికీ స్థానికంగా పువ్వుల దిగుబడులు లేవని రైతులు చెబుతున్నారు. లిల్లీ, మల్లి, జాజులు, కనకాంబరం, దేశవాళీ గులాబీలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతాలకు ప్రధానంగా వినియోగించే బంతి, చామంతులకు తీవ్రమైన కొరత ఏర్పడడంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తున్నారు. వాటి ధరలు సైతం అలాగే ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.
బుధవారం పూల ధరలు ఇలా..
చామంతి కేజీ రూ.300–450
పసుపు బంతి రూ.80–100
ఆరెంజ్ బంతి రూ.90–110
లిల్లీ రూ.300,
మల్లి రూ.1200
జాజులు రూ.800
కాగడాలు రూ.1200
స్టార్ గులాబీ రూ.350–450
కనకాంబరాల బారు రూ.350–400
సంపంగి (వంద) రూ.1000
కడియపులంక మార్కెట్కు కొత్త కళ
శుభ ముహూర్తాల వేళ
జోరుగా విక్రయాలు
స్థానిక దిగుబడి లేక
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి
డిమాండ్ మేరకు పెరుగుతున్న ధరలు


