
నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్ అందజేత
కాకినాడ సిటీ: జిల్లాలో పీహెచ్సీ, యూపీహెచ్సీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన పీహెచ్సీ, యూపీహెచ్సీల సిబ్బందికి నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ సర్టిఫికెట్లను సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సర్టిఫికెట్లు పొందిన వారిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన సిబ్బంది మరింత నైపుణ్యంతో సేవలు అందించి జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాలు సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సర్టిఫికెట్లు పొందిన వాటిల్లో ఏవీ నగరం పీహెచ్సీ, ప్రకాశం స్ట్రీట్, జెట్ల పెదకాపు స్ట్రీట్ యూపీహెచ్సీలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు బెండపూడి–1, జి.మామిడాడ–3, సర్పవరం–3 ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జె.నరసింహ నాయక్, నోడల్ అధికారి డాక్టర్ జి.లక్ష్మి, డీపీఎంఓ డాక్టర్ రవి, భారతి, డాక్టర్లు అర్చన, శ్రీవిద్య, శ్రీనుచంద్ర, ఆయేషా, ప్రత్యూష, టి.ఆశారేఖ తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్కు 503 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 503 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేవీ రామలక్ష్మి, సీపీఓ పి.త్రినాథ్, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటికి సత్వరమే సమగ్ర, సంతృప్తికర పరిష్కారాలు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పోలీస్ గ్రీవెన్స్కు 78 ఫిర్యాదులు
కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచీ అర్జీదారులు వచ్చి తమ ఫిర్యాదులు సమర్పించారు. వారి సమస్యలను ఎస్పీ బిందుమాధవ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొత్తం 78 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు.
గురుకుల ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్ల విడుదల
గోకవరం: ఈ నెల 25న జరగనున్న గురుకుల ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్లు విడుదలైనట్టు కాకినాడ జిల్లా కో ఆర్డినేటర్, భూపతిపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ఈ పరీక్ష జరుగుతుందన్నారు. దీనికి 610 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి కాకినాడలో 3 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే పరీక్షకు 910 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీనికి కాకినాడలో 4 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్ టికెట్లను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని రవి సూచించారు.

నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్ అందజేత

నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్ అందజేత