
లోవకు పోటెత్తిన భక్తులు
తుని: లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకూ 30 వేల మంది భక్తులు తలుపులమ్మ వారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,11,295, పూజా టికెట్ల ద్వారా రూ.1,13,910, కేశఖండన టికెట్ల ద్వారా రూ.16,120, వాహన పూజ టికెట్ల ద్వారా రూ.4,650, కాటేజీల ద్వారా రూ.68,492, ఇతరత్రా రూ.1,02,513 కలిపి దేవస్థానానికి రూ.4,16,980 ఆదాయం సమకూరిందని వివరించారు.
కోటసత్తెమ్మ ఆలయంలో
ప్రత్యేక పూజలు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయంలో నిత్యాన్నదానానికి చవ్వాకుల నాగ మల్లికార్జునరావు, సాయికుమారి దంపతులు (నిడదవోలు) రూ.25 వేల విరాళం సమర్పించారు. రాజమహేంద్రవరం మౌనిక సిల్వర్ వర్క్స్ అధినేత వానపల్లి మురళీకృష్ణ 400 గ్రాముల వెండి అష్టలక్ష్మి చెంబు, బీర్ల సత్యనారాయణ (కె.పెంటపాడు) 14.770 గ్రాముల బంగారం దేవస్థానానికి సమర్పించారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,70,094 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు.
బాలబాలాజీకి
రూ.1.74 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.1,74,499 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 3,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని, 1,500 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.27,030 వచ్చిందన్నారు. నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.59,257 విరాళాలు అందించారని తెలిపారు. యలమంచిలికి చెందిన అందె వీరరాఘవులు, లక్ష్మీసుజాత దంపతులు నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.10,116 విరాళంగా సమర్పించారు.
సాయిబాబాకు రజత ఛత్రం సమర్పణ
రామచంద్రపురం: పట్టణంలోని కోదండ రామాలయంలో కొలువై ఉన్న శిరిడీ సాయిబాబా వారికి పట్టణానికే చెందిన వాడ్రేవు శ్రీరాజరాజేశ్వరి రామ్మూర్తి రూ. 2.20 లక్షల విలువైన రజత ఛత్రాన్ని సమర్పించారు. రాజరాజేశ్వరి ఇటీవల మృతి చెందిన తన అత్తగారు వాడ్రేవు సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం.. కుటుంబ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయిప్రసాద్, రత్న పద్మావతి, వాడ్రేవు శ్రీనివాస్, భానుగాయత్రి, వాడ్రేవు వీరేశలింగం, విన్నకోట శ్రీనివాస్లతో కలసి ఆలయ నిర్వాహకులు, కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, పాలూరి గోపాలకృష్ణకు ఛత్రాన్ని అందజేశారు.

లోవకు పోటెత్తిన భక్తులు

లోవకు పోటెత్తిన భక్తులు

లోవకు పోటెత్తిన భక్తులు