చెప్పులతో కొట్టుకున్న టీడీపీ నాయకులు.. | - | Sakshi
Sakshi News home page

చెప్పులతో కొట్టుకున్న టీడీపీ నాయకులు..

Jul 23 2023 2:00 AM | Updated on Jul 23 2023 1:03 PM

- - Sakshi

కాకినాడ: సార్వత్రిక ఎన్నికలకు ముందే మండల టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. శనివారం ప్రధాన రహదారిలో టీడీపీ నాయకుడ్ని అదే పార్టీకి చెందిన మరొకరు కొట్టడం చర్చనీయాంశమైంది. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బలరామపురం నాయకుడు సోమరౌతు చంద్రమోళి శుక్రవారం కారులో రౌతులపూడి వస్తున్నారు.

ప్రధాన సెంటరుకు వచ్చేసరికి జెడ్‌పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన గంటా గోపి కారును అపారు. ఆపిన వెంటనే అందరూ చూస్తుండగానే చంద్రమౌళిపై చెప్పుతో దాడిచేశారు. దీంతో అక్కడున్నవారు నివ్వెరపోయారు. ఇటీవల పార్టీలో వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలున్నట్లు తెలుస్తోంది.

మండల టీడీపీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ సంఘటనే చెబుతోంది. దాడి విషయం తెలిసిన వెంటనే జిల్లా టీడీపీ అధ్యక్షడు జ్యోతుల నవీన్‌, బలరామపురం వచ్చి చంద్రమౌళిని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement