పాన్గల్: సీఎంఆర్ బకాయిలున్న మండల కేంద్రంలోని శ్రీ వెంకటరమణ రైస్మిల్లును అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఆర్ఐ మహేష్ కథనం మేరకు.. రైస్మిల్లుకు 2023–24 సంవత్సరంలో వరి ధాన్యం కేటాయించగా ఇందుకు సంబంధించిన సీఎంఆర్ ప్ర భుత్వానికి అందించకుండా బకాయి పడ్డారు. బకాయిపడ్డ ధాన్యం విలువ రూ.6.93 కోట్లని.. చెల్లించకపోవడంతో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం మిల్లును తహసీల్దార్ కార్తీక్రావు, ఎస్ఐ కుర్మయ్య పర్యవేక్షణలో సీజ్ చేసి నట్లు ఆర్ఐ వివరించారు. గ్రామపంచాయతీ కార్య దర్శి నరేష్గౌడ్, జీపీఓ రాధ, మల్లేష్ పాల్గొన్నారు.


