ఏళ్లకు ఏళ్లు.. అవే కన్నీళ్లు
శ్రీశైలం నిర్వాసితులకు కలగానే మారిన ప్రభుత్వ ఉద్యోగాలు
కృష్ణానది తీరంలో పునరావాస గ్రామం మంచాలకట్ట
నిర్వాసిత
కుటుంబాలు
11,198
ఉమ్మడి జిల్లాలో
ముంపునకు గురైన గ్రామాలు
67
కోల్పోయిన భూములు 1.23లక్షలు
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలు
8
జోగుళాంబ
గద్వాల జిల్లా పరిధిలో
36
వనపర్తి జిల్లా
పరిధిలో
23
కొల్లాపూర్: దశాబ్దాల కాలంగా శ్రీశైలం నిర్వాసి తుల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. శ్రీశైలం డ్యాం నిర్మాణంతో భూములు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 98ను విడుదల చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలో దాదాపు 70 శాతం మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వగా.. తెలంగాణలో జీఓ 98 అమలుకు నోచుకోలేదు. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి న్యాయం చేస్తామని నాలుగు దశాబ్దాలుగా పాలకులు ఇస్తున్న హామీలు నీటమూటలుగానే మారుతున్నాయి. జీఓ అమలు కోసం సుదీర్ఘకాలంగా ఆందోళనలు చేసిన శ్రీశైలం నిర్వాసితులు.. న్యాయపోరాటం సైతం చేస్తున్నప్పటికీ పాలకుల్లో చలనం రావడం లేదు.
ఉమ్మడి జిల్లాలో 175 మందికే ఉద్యోగాలు..
శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి పాలమూరు, కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాలు కృష్ణా బ్యాక్వాటర్లో మునిగిపోయాయి. 1970– 82 మధ్య లో అధికారులు నిర్వాసిత గ్రామాల నుంచి ప్రజల ను ఖాళీ చేయించారు. దీంతో వారు నది తీరంలో నే కొత్త నివాసాలు ఏర్పాటు చేసుకోగా.. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1986లో అప్పటి ప్రభుత్వం జీఓ 98 జారీ చేసింది. ఈ జీఓ ద్వారా ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని.. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ జీఓ ప్రకారం కర్నూలు జిల్లాలో వేలాది మంది నిర్వాసి తులకు ఉద్యోగాలు కల్పించిన గత ప్రభుత్వాలు.. పాలమూరు నిర్వాసితులను పట్టించుకోలేదు. ఉ మ్మడి జిల్లాలో 2,318 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఐదుగురికి 1993లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మరో 30 మందికి, 2015లో కిరణ్కుమార్రెడ్డి హయాంలో 128 మంది నాన్ లోకల్ కో టా లష్కర్ ఉద్యోగా లు కల్పించారు. వీరిలో ఐదు గురి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. ఈ ఏడాది కోర్టు ఆదేశాల ప్రకారం నాగర్కర్నూల్ కలెక్టర్ 12 మంది నిర్వాసితులకు నీటిపారుదల శాఖలో ఉ ద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా 175 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు దక్కాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మిగిలిన వారిలో 633 మంది మరణించగా.. 410 మంది వయసు పైబడి ఉద్యోగార్హత కోల్పోయారు. ఇక మిగిలింది 1,206 మందే. అయితే వీరే కాకుండా.. పలువురు నిర్వాసితులు ఉద్యోగాల అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా..ప్రజాప్రతినిధులు మారినా తీరని గోస
బుట్టదాఖలైన వినతులు.. నీటిమూటలైన హామీలు
ఎన్ని పోరాటాలు చేసినా
అమలుకాని 98, 68 జీఓలు
సొంత జిల్లావాసులపై ముఖ్యమంత్రి కనికరం చూపాలని వేడుకోలు
ఏళ్లకు ఏళ్లు.. అవే కన్నీళ్లు
ఏళ్లకు ఏళ్లు.. అవే కన్నీళ్లు


