
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్వికాసం పథకాలలో అర్హులైన వారికే అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రాజీవ్యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్లపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించిందని వివరించారు. జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీల నుంచి 25,500 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తులను సెక్టార్ల వారీగా స్క్రూటిని చేయాలన్నారు. సోమవారం వరకు సంబఽంధిత బ్యాంకు మేనేజర్లకు సమర్పించాలని, జిల్లా స్థాయిలో దరఖాస్తుల పరిశీలన మే 28 వరకు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతిపై మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తున్నందున నిర్థేశించిన లక్ష్యం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్బాబు, ఎల్డీఎం శ్రీనివాస్రావు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.