
వంద రోజులు పని కల్పించండి
గద్వాల: ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలోని కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కూలీలను మొబిలైజ్ చేయాలని వందరోజుల పనిదినాలు కల్పించాలన్నారు. ప్రతిపనికి సంబంధించి అన్ని రిజిస్ట్రర్లు, ప్రాథమిక రికార్డులు పూర్తిగా ఖచ్చితంగా ఉండాలన్నారు. గత మూడు సంవత్సరాల పనుల వివరాలు, సంవత్సరాల వారిగా ప్రతిపని పూర్తయిందా లేదా అనే వివరాలను ప్రతి పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. కేవలం ప్రజలకు పనులు కల్పించడమే కాకుండా తోటలు, చెరువులు, నీటినిల్వలు, రోడ్లు వంటి పనులకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. కూలీ రేటు రూ.300–307పెంచినట్లు తెలిపారు. డిమాండ్కు తగ్గట్లు పనులు జరిగేలా కార్యాచరణ తయారు చేయాలన్నారు. ఉపాధి హామి పథకం కింద నిర్వహించే ఏడు రిజిస్టర్లను ఖచ్చితంగా తమ వద్ద ఉంచుకోవాలన్నారు.
ఉపాధి పనుల్లో తోటలు, చెరువులు, రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి
కలెక్టర్ బీఎం సంతోష్