భూపాలపల్లి: పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ను దృష్టిలో ఉంచుకుని జిల్లా యువతకు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో 75 రోజుల ఉచిత డే స్కాలర్ శిక్షణ తరగతులు శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై ఎస్పీతో కలిసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న జిల్లా యువతకు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ... జిల్లా యువత పోలీస్ ఉద్యోగాలు సాధించేందుకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఈ కోచింగ్ ప్రారంభించామన్నారు. పోలీస్ ఉద్యోగం ద్వారా సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


