మల్హర్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని విద్యుత్ శాఖ ఎస్ఈ రమేశ్ అన్నారు. శనివారం మండలంలోని పెద్దతూండ్ల సబ్స్టేషన్ నుంచి తాడిచర్ల పరిధిలో 5 కిలోమీటర్ల పొడవైన 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33కేవీ లైన్ ఏర్పాటుతో రైతులు, వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందుతుందన్నారు. తాడిచర్ల, పెద్దతూండ్ల, ఏఎమ్మార్ సబ్ స్టేషన్ల పరిధిలో సాంకేతిక సమస్యలు ఎదురైనా, ఈ నూతన ఇంటర్ లింక్ లైన్ ద్వారా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించవచ్చన్నారు. అత్యవసర సమయాల్లో విద్యుత్ కోతలు, అంతరాయం లేకుండా నిరంతరం అందించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఈ నాగరాజు, సేఫ్టీ ఆఫీసర్ జగదీష్, కన్సట్రక్షన్ ఏడీ సందీప్, ఏఈ శ్రీనివాస్, లైన్మెన్ అశోక్, ఏఎల్ఎం రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ ఎస్ఈ రమేశ్
తాడిచర్లకు 33కేవీ లైన్ ప్రారంభం


