వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నల్లగుంటలో సోమవారం వరంగల్ డీసీసీ బ్యాంక్ ములుగు శాఖ, వెంకటాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై సోమవారం అవగాహన కల్పించినట్లు బ్రాంచ్ ఫీల్ట్ ఆఫీసర్ కార్తీక్రెడ్డి తెలిపారు. ప్రజలకు బ్యాంక్ ఖాతా, పొదుపు, ఫిక్సిడ్ డిపాజిట్ ప్రాముఖ్యత, పీఎంజేజేబీవై(ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన), పీఎంఎస్బీవై(ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన), కేవైసీ, రీకేవైసీ, అలాగే బ్యాంకు ద్వారా అందిస్తున్న వివిధ రకాల రుణ సౌకర్యాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సిబ్బంది యాట లింగయ్య, రమేశ్, కోటి తదితరులు పాల్గొన్నారు.


