
ఉపాధి కల్పిస్తామని ఉసురు తీస్తున్నారు..
గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్లో తమ గ్రామ సమస్యపై అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వారి మాటల్లోనే.. 2003 సంవత్సరంలో భూగర్భ గని ఏర్పాటులో భాగంగా సింగరేణి యాజమాన్యం మా వ్యవసాయ భూములను తీసుకొని పరిహారం చెల్లించింది. ఇప్పుడు ఆ గనిని తొలగించి ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ 3 ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో బాంబు బ్లాస్టింగ్ల మూలంగా మా ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. చిన్నచిన్న గుడిసెలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. భారీ వాహనాల రాకపోకలు, బాంబు బ్లాసింగ్లతో గాలి కాలుష్యమై మా ఊరి వాళ్లు ఆస్పత్రుల పాలవుతున్నారు. కొంతమంది శ్వాసకోస ఇబ్బందులకు గురై మృతి చెందారు. భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇక్కడ మేము ఉండలేమని, మా గ్రామాన్ని సేకరించి పరిహారం చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా మా గ్రామాన్ని తరలించి పునరావాసం, ప్యాకేజీ అందజేయాలి.