భూ భారతిపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

భూ భారతిపై అవగాహన కల్పించాలి

Apr 16 2025 11:34 AM | Updated on Apr 16 2025 11:34 AM

భూ భారతిపై అవగాహన కల్పించాలి

భూ భారతిపై అవగాహన కల్పించాలి

భూపాలపల్లి: భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు అన్ని మండలాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు షెడ్యూల్‌ తయారు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మంగళవారం అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతీ మండలంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాల చేపట్టాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూ భారతి చట్టం హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి చట్టంపై ప్రజలకు సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పేద కుటుంబాలను ఎంపిక చేయాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement