
ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు పాటించాలి
భూపాలపల్లి: ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులు వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బందికి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ చలువ కళ్లద్దాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వేసవిలో అతినీల లోహిత కిరణాల వలన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, ప్రతీ ఒక్కరు కళ్లద్దాలు, టోపీలు తప్పకుండా వాడాలన్నారు. విధుల్లో ఉన్నప్పుడు ప్రతీ అర్ధగంటకు ఒకసారి మంచినీరు తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఎ.సంపత్రావు, సీఐ డి.నరేష్కుమార్, ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే