
రాజ్యాంగంపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరువు
కాటారం/కాళేశ్వరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగంపై చిత్తశుద్ధి లేదని, రాజ్యాంగాన్ని ప్ర జల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఏ మాత్రం చేయ డం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో బహుజన సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రా జ్యాంగ స్థూపాన్ని మహదేవపూర్ మండలం సూరా రంలో మాజీ సర్పంచ్ నాగుల సుజాత–లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్పర్సన్ శ్రీహర్షిణిరాకేశ్తో కలిసి ఈ శ్వర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ.. బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం, కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ప్రజల్లో చైతన్యం, హక్కులపై అవగాహన లేకుంటే ధైర్యంగా ముందుకెళ్లలేరని తెలిపారు. ఇన్నేళ్లుగా పరిపాలన చేసిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమయ్యారని అన్నారు. రాజ్యాంగం ప్రజలకు తెలిస్తే తమని ప్రశ్నిస్తారనే కుట్ర పాలకుల్లో దాగిఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అబద్దాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. అంబేడ్కర్ను ఒక సామాజికవర్గానికే అంటగట్టడం సమంజసం కాదన్నారు. రా జ్యాంగంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా రచించారని, కేవలం ఎస్సీలకు మాత్రమే మేలు చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎలా సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రా ష్ట్రం సాధించుకున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలన్నారు. పుట్ట మధు మాట్లాడుతూ మంథనిలో 40 ఏళ్లుగా పాలించిన ఒకే కుటుంబం ప్రజ లకు ఏం చేసిందో చెప్పాలన్నారు. సొంత ఖర్చులతో ప్రధాన కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన లక్ష్మారెడ్డిని అభినందించారు. రాకేశ్ , శ్రీనివాస్, కిరణ్, తిరుపతి, శ్రావణ్, గీతాబాయి, శ్రీలక్ష్మిచౌదరి, శ్రీనివాసరావు, గీత, లక్ష్మణ్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్