● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
నర్మెట: మహనీయుల ఆశయ సాధనలో యువత ముందుండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, విశారదన్ మహారాజ్ అన్నారు. మండలంలోని కన్నెబోయిన గూడెంలో విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆదివారం రాత్రి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడారు. సర్పంచ్ రమేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గద్దల నర్సింగరావు, వెల్దండ సర్పంచ్ కంతి అంజనేయులు, విగ్రహదాత మాజీ సర్పంచ్ కంతి హేమలత రాజలింగం, ఎండీ గౌస్ పాల్గొన్నారు.


