జనగామ
న్యూస్రీల్
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జాతీయస్థాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలకు ఎంపిక
7
జనగామ రూరల్: జాతీయ స్థాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలకు తెలంగాణ బృందం తరఫున ధర్మకంచ విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని పాఠశాల హెచ్ఎం కనకయ్య అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగే టెన్నిస్ వాలీబాల్ పోటీలకు ఇటీవల 4 రోజులపాటు ధర్మ కంచ పాఠశాలలో శిక్షణా శిబిరం ఏర్పాటు చేయగా ఈ శిక్షణా శిబిరంలో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చి ఎంపికయ్యారన్నారు. సీనియర్ నేషనల్ క్రీడాకారులు బాలికలు సంధ్య, నవీక , బాలురు ఎం.గణేష్, విజయ్ జాతీయ స్థాయి క్రీడాకారులు, బాలికలు అశ్విత, మేఘన శ్రీ, బాలురు మధు, రమేశ్, మినీ నేషనల్ క్రీడాకారులు బాలికలు సాత్విక, ఐశ్వర్య, బాలురలో హరిచరణ్, శ్రీశాంత్, వర్షిత్ ఎంపికయ్యారన్నారు.
జనగామ
జనగామ


