ఇప్పటివరకు చనిపోయిన కుటుంబాలకు రైతుబీమా ఓ వరంగా ఉండేది. ఇప్పుడు రద్దయినట్లు తెలిసింది. రైతుబీమాతో ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా వెసులబాటు కలిగింది. పథకంపై ప్రభుత్వం పునరాలోచన చేసి పునరుద్ధరించాలి.
– దుంపల గంగారెడ్డి,
పోరండ్ల, జగిత్యాల రూరల్
రైతుబీమా పునరుద్ధరించాలి
రైతులకు అండగా ఉన్న రైతుబీమాను పునరుద్ధరించాలి. ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడంతో ఈనెల 15 తర్వాత ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తించే అవకాశం లేకుండా పోయింది.
– పన్నాల తిరుపతి రెడ్డి,
రైతు ఐక్యవేదిక నాయకుడు


