మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయం పరిసరాలు, ప్రకృతి సోయగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కొండపైకి వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా ఎత్తుగా.. ఎటు చూసినా పచ్చదనంతో కూడిన చెట్లు అలరిస్తున్నాయి. కొండలరాయుడి సన్నిధి నుంచి లోయలు.. గుట్టలు, పెద్ద పెద్ద బండరాళ్లు స్వామివారిని దర్శనానికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
● ఆకట్టుకుంటున్న కొండలు..లోయలు..
● ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్న భక్తులు


