
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి
జగిత్యాలజోన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా మొదటి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్ను శనివారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించారు. విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకోవాలని, దానిని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విద్య ద్వారానే కుటుంబపరిస్థితులు మారిపోతాయని, విద్యకు పేద, ధనిక బేధం లేకుండా ప్రతి ఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సురేశ్, విజయ్కుమార్, జిల్లా సంక్షేమాధికారి బి.నరేశ్ పాల్గొన్నారు.
భూ భారతి చట్టంతో రైతులకు మేలు
జగిత్యాలరూరల్/మల్లాపూర్ భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి మేలు చేస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాకేంద్రంలో జగిత్యాల అర్బన్, రూరల్ మండలం, మల్లాపూర్ మండలంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. పారదర్శకత జవాబుదారీతనంతో పని చేసేలా చట్టాన్ని రూపొందించిందన్నారు. రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందన్నారు. భూముల విస్తీర్ణం మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు అప్పీల్ వ్యవస్థకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆర్డీవో మధుసూదన్, అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, మల్లాపూర్లో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వీర్సింగ్, ఎంపీడీవో శశికుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, ఏవో లావణ్య తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలందరికీ ప్రభుత్వ సహాయం
జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ప్రభుత్వ సహాయం అందిస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగిత్యాలరూరల్, అర్బన్ మండలాలకు చెందిన 93 మందికి మంజూరైన రూ.26.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 87 మందికి కల్యాణలక్ష్మి కింద మంజూరైన రూ.87 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు దుస్తులు కుట్టే మహిళా సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యత మహిళలకిచ్చి ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్లు శ్రీనివాస్, రాంమోహన్, ఏపీఎం గంగాధర్, సీసీలు పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో రూ.4 లక్షలతో నిర్మించిన గౌడ సంఘ భవనాన్ని ప్రారంభించారు. 45 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు.
ఘనంగా మహాలింగార్చన
ధర్మపురి: మాస శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని ధర్మపురి నృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రుద్రనమకం, మాన్యసూక్తం, లక్ష్మీసూక్తం, పురుష సూక్తం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్ తదితరులున్నారు. నృసింహస్వామి ఆలయానికి శనివారం ఒక్కరోజే వివిధ సేవల కింద రూ.2,84,310 ఆదాయం సమకూరింది.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి