రజతోత్సవ సభకు 20వేల మంది | - | Sakshi
Sakshi News home page

రజతోత్సవ సభకు 20వేల మంది

Apr 26 2025 12:07 AM | Updated on Apr 26 2025 12:07 AM

రజతోత్సవ సభకు 20వేల మంది

రజతోత్సవ సభకు 20వేల మంది

జగిత్యాల: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు జిల్లా నుంచి 20 వేల మంది తరలిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌ సభకు రావడానికి ప్రజలు ఉత్సాహం కనబర్చుతున్నారని తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వంపై విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మాజీ జెడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ, ప్రజలందరూ ఇంటి పార్టీగా భావించి గులాబీ జెండా గుండెల్లో నింపుకున్నారని, ప్రజలంతా రజతోత్సవ సభకు రావడానికి విరాళాలు సైతం ఇస్తున్నారన్నారు. అనంతరం ఉగ్రదాడిలో మరణించిన అమరులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు సతీశ్‌, వొల్లం మల్లేశం, సమిండ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement