
‘పెద్దింటి’కి అరుదైన గౌరవం
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన ప్రముఖ కథారచయిత పెద్దింటి అశోక్కుమార్కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయన రాసిన జిగిరి, గోస, అనగనగా ఓ కోడిపెట్ట అనే కథలను వరంగల్లోని శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులకు సిలబస్గా ప్రవేశపెట్టారు. ఆయా కథలను బోధించే బాధ్యతను కూడా అప్పగించారు. స్వతహాగా ఉపాధ్యాయుడైన పెద్దింటి కళాశాల విద్యార్థులకు కథలను పాఠాలుగా బోధించారు. ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల కళాశాలలో రచయితే అధ్యాపకుడై బోధించడం ఇదే తొలిసారి అని ప్రిన్సిపాల్ సానబోయిన సతీశ్ తెలిపారు. తన కథలపై తానే విస్తృతోపన్యాసం ఇవ్వడం మర్చిపోలేని అనుభవంగా పెద్దింటి అభివర్ణించారు. ఈ సందర్భంగా పెద్దింటిని మానేరు రచయితల సంఘం ప్రతినిధులు, కవులు, రచయితలు అభినందించారు.