గల్లంతయిన బాలుడు శవమై.. | - | Sakshi
Sakshi News home page

గల్లంతయిన బాలుడు శవమై..

Apr 20 2025 2:07 AM | Updated on Apr 20 2025 2:07 AM

గల్లంతయిన బాలుడు శవమై..

గల్లంతయిన బాలుడు శవమై..

మల్లాపూర్‌: మండలకేంద్రం శివారులోని లింగన్న చెరువులో గల్లంతయిన బాలుడు పుట్ట రాజేశ్‌ (13) శవమై కనిపించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని దుర్గమ్మకాలనీకి చెందిన పుట్ట పోశెట్టి, కవిత దంపతుల పెద్దకుమారుడు రాజేశ్‌ పశువులను మేపడానికి శుక్రవారం వెళ్లాడు. లింగన్న చెరువులో స్నానం చేసేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఎస్సై రాజు సిబ్బందితో ఘటనస్థలికి వెళ్లి గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలించారు. ఈక్రమంలో శనివారం ఉదయం చెరువులో శవమై పైకి తేలాడు. రాజేశ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement