జగిత్యాల: జిల్లాలో మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టినా.. సెట్బ్యాక్ లేకున్నా నోటీసులు లేకుండానే కూల్చివేస్తున్నారు. ఎవరైనా మున్సిపల్ కబ్జా చేసుకుంటే మాత్రం మున్సిపల్ అధికారులు స్పందించండం లేదు. నిర్మాణాలను ఎలా కూల్చివేస్తున్నారో స్థలాలను ఆక్రమించుకున్న వారిని సైతం వెళ్లగొట్టి స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అద్దెకు దుకాణాలను తీసుకుని దాని ఎదుట మరో దుకాణం అంత రేకులషెడ్డుతో కబ్జా చేస్తున్నారు. ఇది అంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?
జిల్లాలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు వెలిశాయి. ఇటీవల వ్యాపారాలు పెరగడం, ఎలాంటి సదుపాయాలు లేకుండా భవనాలు నిర్మించడం, ఫుట్పాత్లను సైతం ఆక్రమించి డ్రెయినేజీలపై కప్పులు వేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు.
ఆదాయానికి భారీగండి
మున్సిపల్ స్థలాల్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు, పాకలవర్గాలు పట్టించుకోకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. గతంలో జిల్లాకేంద్రంలో అంగడిబజార్లో ఉన్న ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఒక్కో షాపు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలతో టెండర్లు దక్కించుకున్నారు. కోట్లాది రూపాయల విలువ గల స్థలాల్లోని అక్రమణలను తొలగిస్తే జిల్లాకు ఆదాయం అధిక సంఖ్యలో లభిస్తుంది. మున్సిపల్ స్థలాల్లో అక్రమంగా షెడ్లు వేసుకున్నవారు మున్సిపల్కు కొంతమొత్తం మాత్రమే ఫీజు చెల్లిస్తున్నట్లు సమాచారం. షాపుల ముందు వరకూ సామగ్రిని పెట్టడం ద్వారా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. జిల్లాకేంద్రంలో టవర్సర్కిల్, తహసీల్ చౌరస్తా, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో అధికంగా వాణిజ్య సముదాయాలున్నాయి. అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో అతిపెద్ద మున్సిపల్ అయిన కోరుట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
పట్టింపులేని మున్సిపల్ అధికారులు కబ్జాకు గురవుతున్న విలువైన స్థలాలు సముదాయాలు నిర్మిస్తే బల్దియాకు ఆదాయం
ఇది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ ముందు నిర్మించిన వ్యాపార సముదాయాలు. అద్దెకు తీసుకున్నవారు దుకాణాలను మించి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి షెడ్లు వేసుకున్నా అడిగేవారు లేరు. ఫలితంగా ఆ ప్రాంతం రద్దీగా ఉండటంతోపాటు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆర్టీసీ యజమాన్యం నోటీసులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఈ చిత్రంలో కనిపిస్తోంది జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న
ఉద్యానవనానికి సంబంధించిన స్థలం. ఈ స్థలాన్ని ఆక్రమించి పండ్ల దుకాణాలు, హోటల్స్, టీస్టాల్స్ ఏర్పాటు చేశారు. అయినా మున్సిపల్ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. స్థలాన్ని ఆక్రమించుకున్న వారి నుంచి కొందరు అమ్యామ్యాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇది జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్ వద్దనున్న మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట దర్జాగా కబ్జా చేసుకున్నారు. ఇటీవల దానికి మెట్లు ఉండగా.. రోడ్డు వెడల్పు అని దానిని కూల్చివేసినప్పటికీ వాహనాలు పార్కింగ్ చేయడంతోపాటు, పండ్ల వ్యాపారాలు చేసుకుంటున్నారు.
ఇది మెట్పల్లి పట్టణంలోని ప్రధాన రోడ్డు. రోడ్డుపైనే పార్కింగ్లతోపాటు, రేకులషెడ్డులతో ముందుకు వస్తున్నారు. పార్కింగ్ సమస్య మారడంతో వెహికిల్స్ పెట్టుకోవాలంటే రోడ్డుపై పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇది కోరుట్ల మున్సిపాలిటీలోని ప్రధానరోడ్డు. ఈ రోడ్డుపైనే దుకాణదారులు సామగ్రిని పెడుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపారులు ఫుట్పాత్లను సైతం ఆక్రమించుకుంటున్నారు.
బల్దియా స్థలాల ఆక్రమణ
బల్దియా స్థలాల ఆక్రమణ
బల్దియా స్థలాల ఆక్రమణ
బల్దియా స్థలాల ఆక్రమణ
బల్దియా స్థలాల ఆక్రమణ