
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య అంతకంతకూ వైరం తీవ్రస్థాయికి చేరుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో వివాదాస్పద బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యలు తీసుకోవాలని టెక్ బిలియనీర్ ప్రయత్నిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ను హెచ్చరించారు.
వ్యయ బిల్లుపై మస్క్ విమర్శల అనంతరం అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహం చెడింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అండగా నిలుస్తున్న రిపబ్లికన్లను మస్క్ టార్గెట్ చేస్తున్నారనే వార్తలు ట్రంప్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ట్రంప్ బహిరంగంగా మస్క్కు హెచ్చరించారు. ట్రంప్ తీసుకువస్తున్న బడ్జెట్ బిల్లును వ్యతిరేకిస్తున్న కొంతమంది డెమోక్రాట్ ఎంపీలు తమకు భారీగా నిధులు సమకూర్చాలని ఎలాన్ మస్క్ను కోరారు. దీనికి మస్క్ సమ్మతించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో డెమోక్రాట్లకు నిధులు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎలాన్ మస్క్ను ట్రంప్ హెచ్చరించారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతుడైన డొనాల్డ్ ట్రంప్, అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ మధ్య జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. ఎలాన్ మస్క్తో సంబంధాన్ని సరిదిద్దుకోవాలనే ఆసక్తి తనకు లేదని, ఆయనతో మాట్లాడే ఉద్దేశ్యం కూడా తనకు తనకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తన రెండవ పదవీకాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లుపై మస్క్ తీవ్ర విమర్శలు చేసిన దరిమిలా వారి మధ్య సంబంధం తెగిపోయింది.
ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది?