ఉజ్బెకిస్తాన్‌లో  మోదీకి ఘన స్వాగతం  | PM Narendra Modi flags shared vision in Tashkent | Sakshi
Sakshi News home page

ఉజ్బెకిస్తాన్‌లో  మోదీకి ఘన స్వాగతం 

Aug 30 2026 6:09 AM | Updated on Aug 30 2026 6:09 AM

PM Narendra Modi flags shared vision in Tashkent

మూడు కీలక పదవుల నుంచి హఠాత్తుగా తొలగింపు  

డోక్లాం, గల్వాన్‌ ఘటనల్లో సైన్యానికి సారథ్యం వహించిన జోంగ్‌కీ 

తాష్కెంట్‌: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉజ్బెకిస్తాన్‌ చేరుకున్నారు. తాష్కెంట్‌ విమానాశ్రయంలో మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు మిర్జియోయేవ్‌ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లో పర్యటిస్తుండడం ఇది నాలుగోసారి. భారత్, ఉజ్బెకిస్తాన్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఆయన దిశగా కృషి చేయనున్నారు.

 అధ్యక్షుడు మిర్జియోయేవ్‌తో ప్రతినిధుల స్థాయి చర్చలు నిర్వహించబోతున్నారు. ఉజ్బెకిస్తాన్‌లో అడుగు పెట్టిన తర్వాత రాజధాని తాష్కెంట్‌లోని యాంగీ ఉజ్బెకిస్తాన్‌ పార్కును మోదీ సందర్శించారు. స్వాతంత్య్ర స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా ఆయన వెంట అధ్యక్షుడు మిర్జియోయేవ్‌ కూడా ఉన్నారు. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement