ప్రజల బంగారంపై పాక్‌ ప్రభుత్వం కన్ను | Pakistan government eyes people gold to increase foreign exchange reserves | Sakshi
Sakshi News home page

ప్రజల బంగారంపై పాక్‌ ప్రభుత్వం కన్ను

Feb 21 2022 6:36 AM | Updated on Feb 21 2022 7:32 AM

Pakistan government eyes people gold to increase foreign exchange reserves - Sakshi

ఇస్లామాబాద్‌: నానాటికీ క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునేందుకు ప్రజల నుంచి బంగారాన్ని అప్పుగా తీసుకోవాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం యోచిస్తోంది. పాక్‌ ఆర్థిక పరిస్థితి ఇటీవల కాలంలో వేగంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్‌ ఈఈసీ (ఎకనమిక్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌) ప్రజల నుంచి బంగారం తీసుకునే ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం కమర్షియల్‌ బ్యాంకులు ప్రజల నుంచి బంగారం రుణంగా తీసుకొని వడ్డీ చెల్లిస్తాయి. ఇలా సేకరించిన బంగారాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌లో డిపాజిట్‌ చేసి విదేశీ నిల్వలు పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. పాక్‌ ప్రజల వద్ద దాదాపు 5వేల టన్నుల బంగారం ఉంటుందని అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement