
మరో 12 రోజులు మాత్రమే యుద్ధం కొనసాగించగలం
ఇజ్రాయెల్ సైనిక వర్గాల ఆందోళన
టెల్ అవీవ్: ఇరాన్పై యుద్ధంలో తమపై పైచేయి అవుతోందని, ఇరాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ పదేపదే చెప్పుకుంటోంది. కానీ, యుద్ధాన్ని కొనసాగించడానికి కావాల్సిన సాధన సంపత్తి రోజురోజుకీ తరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ క్షిపణులను నేలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్రేంజ్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది.
ఇజ్రాయెల్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు తగినంతగా లేవని అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది. గత ఆరు రోజులుగా ఇరుదేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్పై దాదాపు 400 బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించింది. వీటిలో చాలావరకు మిస్సైళ్లను ఇజ్రాయెల్ సైన్యం మధ్యలోనే కూల్చివేసింది.
ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఇంకా 1,600 ఉన్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ, వాటన్నింటినీ కూల్చే ఇంటర్సెప్టర్లు ఇజ్రాయెల్ వద్ద లేవు. అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు తేల్చిచెబు తున్నారు. ఇప్పుడున్న సిస్టమ్స్ మరో 10 నుంచి 12 రోజు ల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.