భారత్‌పై బిలావల్‌ ఆక్రోశం | Getting Kashmir issue at centre of UN agenda uphill task | Sakshi
Sakshi News home page

భారత్‌పై బిలావల్‌ ఆక్రోశం

Mar 12 2023 5:17 AM | Updated on Mar 12 2023 5:17 AM

Getting Kashmir issue at centre of UN agenda uphill task - Sakshi

ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ను పాలస్తీనాతో పోలుస్తూ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘రెండుచోట్లా పరిస్థితులు ఒక్కటే. రెండు సమస్యలనూ ఐరాస ఇప్పటికీ పరిష్కరించలేదు.

కశ్మీర్‌ను ఐరాస ప్రధాన ఎజెండాలోకి తీసుకురాకుండా భారత్‌ పదేపదే అడ్డుపడుతోంది’’ అంటూ వాపోయారు. భారత్‌ను గురించి మాట్లాడే క్రమంలో ఒకసారి మిత్రదేశం, మరోసారి పొరుగుదేశం అంటూ ఆయన తడబాటుకు గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement