ఫ్రాన్స్‌లో ఉన్న భారత ఆస్తుల జప్తుపై ఇంకా నోటీస్‌ అందలేదు

Central Govt Says No Notice Yet On UK Group Freezing Indian Properties in France - Sakshi

న్యూఢిల్లీ: పారిస్‌లో ఉన్న భార‌తీయ ఆస్తుల‌ను స్కాట్‌లాండ్‌కు చెందిన కెయిన్ ఎన‌ర్జీ సంస్థ జ‌ప్తు చేయనుందనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ."పారిస్‌లో భారత ప్రభుత్వ ఆస్తులను కెయిన్‌ ఎనర్జీ స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే భారత ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ ఫ్రెంచ్ కోర్టు నుంచి నోటీసులు రాలేదు"అని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది.

కెయిన్‌ ఎనర్జీ టాక్స్‌ వివాదం:
కెయిన్ ఎన‌ర్జీ సంస్థ దాఖ‌లు చేసిన ఓ కేసులో.. అంత‌ర్జాతీయ ట్రిబ్యున‌ల్‌ కోర్టు భార‌త్‌కు 1.2 బిలియ‌న్ల డాల‌ర్ల జ‌రిమానా విధించింది. 2014లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని భార‌త్ ఉల్లంఘించినట్లు ట్రిబ్యున‌ల్ పేర్కొన్నది. దానిలో భాగంగా ఫ్రాన్స్‌లో ఉన్న ఆస్తుల‌ను ఆ కంపెనీ స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విష‌యంపై గ‌తంలో ఆ సంస్థ ప‌లు దేశాల్లో భార‌త్‌పై కేసు న‌మోదు చేసేందుకు ప్రయ‌త్నించింది.

కాగా, భార‌తీయ ప్రాప‌ర్టీల‌ను అమ్మకం ద్వారా వ‌చ్చే ఆదాయం కెయిన్ సంస్థలకు వెళ్తుంద‌ని ట్రిబ్యున‌ల్ త‌న తీర్పులో వెల్లడించింది. ఫ్రెంచ్ కోర్టు ఆదేశాల మేర‌కు సుమారు 20 ప్రాప‌ర్టీల‌ను ఆ సంస్థ స్వాధీనం చేసుకోనున్నది. ఆ ప్రాప‌ర్టీల‌ విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఓ కేసు విష‌యంలో సెటిల్మెంట్‌లో భాగంగా ఈ సీజ్ మొద‌లైన‌ట్లు సమాచారం.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top