21 నుంచి అరుదైన నాణేలు, కరెన్సీ ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

21 నుంచి అరుదైన నాణేలు, కరెన్సీ ప్రదర్శన

Apr 11 2025 8:52 AM | Updated on Apr 11 2025 8:52 AM

21 నుంచి అరుదైన నాణేలు, కరెన్సీ ప్రదర్శన

21 నుంచి అరుదైన నాణేలు, కరెన్సీ ప్రదర్శన

చార్మినార్‌: ఈ నెల 21, 22, 23 తేదీల్లో పాతబస్తీలోని ఉర్దూ ఘర్‌లో అరుదైన అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ నోట్లు, పురాతన వస్తువుల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు. అరుదైన నాణేలు, పేపర్‌ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్‌ల ప్రదర్శన చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఎగ్జిబిషన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏపీజే అబ్దుల్‌ కలాం వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్‌ అందరికీ అందు బాటులో ఉంటుందని.. తమకు కావాల్సిన వాటిని ఖరీదు చేయవచ్చని, అలాగే తమ వద్ద ఉన్న పురాతన నాణేలను విక్రయించవచ్చని సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ హై ఖాద్రీ తెలిపారు. నాణేలు, పేపర్‌ కరెన్సీ, స్టాంపులు, పెయింటింగ్‌లతో పాటు ఇతర పురాతన వస్తువుల మిశ్రమ కలయిక వస్తువులను ఎగ్జిబిషన్‌లో సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement