ఓయూలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఓయూలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

Mar 24 2023 6:34 AM | Updated on Mar 24 2023 6:34 AM

సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న అతిథులు  - Sakshi

సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న అతిథులు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌ దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఉన్నత విద్య, సుస్థిర అభివృద్ధి అంశంపై నిర్వహించనున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొ.గణేష్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన మాజీ వీసీ ప్రొ.తిరుపతిరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. సుస్థిర అభివృద్ధి సాధించడంలో ఆర్థికశాస్త్రం, పర్యావరణం, సామాజిక సమానత్వం ముఖ్య పాత్రలు పోషించాలని మాజీ వీసీ ప్రొ. వర్గీస్‌ తన కీలకోపన్యాసంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఈపీ మాజీ డైరెక్టర్‌ ప్రొ.ఆర్కే మిశ్ర, సదస్సు కన్వీనర్‌ ప్రొ.చంద్రునాయక్‌, యూజీసీ డీన్‌ ప్రొ.మల్లేశం, ప్రొ.చెన్న బసవయ్య, ప్రొ.రమా మెల్కొటే, డాక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement