కాకతీయ యూనివర్సిటీలో గురువారం రాత్రి ఘనంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. గిరిజన యువతులు గోధుమ బుట్టలతో ఊరేగింపుగా పరిపాలన భవనం నుంచి రెండో గేట్ దరకు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ వెళ్లి నిమజ్జనం చేశారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ హాజరై మాట్లాడుతూ.. ‘తీజ్’ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ వి.రామచంద్రం, కేయూ పాలకమండలి సభ్యుడు సురేశ్లాల్, ఓఎస్డీ వెంకట్రామ్రెడ్డి, సైన్స్ డీన్ ప్రొఫెసర్ జి.హన్మంతు తదితరులు పాల్గొన్నారు. – కేయూ క్యాంపస్


