రెండు బైక్‌లు ఢీ.. తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ.. తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడి మృతి

Nov 23 2025 9:34 AM | Updated on Nov 23 2025 9:34 AM

రెండు బైక్‌లు ఢీ..  తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడి మృ

రెండు బైక్‌లు ఢీ.. తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడి మృ

హసన్‌పర్తి: రెండు బైక్‌లు ఎ దురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ తాత్కాలిక పా రిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన వంగపహా డ్‌ శివారులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ఇల్లందుల సదానందం(38) స్థా నిక జీపీలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఇదే మండలం బుచ్చయ్యపల్లిలోని తన అత్తగారింటికి బైక్‌పై బయలుదేరాడు. వంగపహాడ్‌ శివారుకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మరో బైక్‌ సదానందంను ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడికి భార్య సుమలత, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement