అధికారులు అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అందుబాటులో ఉండాలి

Aug 13 2025 7:38 AM | Updated on Aug 13 2025 7:38 AM

అధికారులు అందుబాటులో ఉండాలి

అధికారులు అందుబాటులో ఉండాలి

హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ అర్బన్‌: భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరిధిలో ని అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆదేశించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత శాఖలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు స్థానికంగా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

పోలీసులకు సమాచారం ఇవ్వండి : సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, శిథిలావస్థ భవనాల్లోని నివాసితులు ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షంలో వాహనాలపై వెళ్లే వారు వాహనాల కండీషన్‌ పరిశీలించుకోవాలని, ఏమైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement