ట్యాంకర్ల ద్వారా సరఫరా.. | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

Apr 24 2025 1:44 AM | Updated on Apr 24 2025 1:44 AM

ట్యాం

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

ఎల్‌ఎండీ నుంచి సరఫరా చేసే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాకతీయ కాల్వ నీరు నిలిచిపోయింది. గోదావరి జలాలు అడుగంటిపోగా.. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ధర్మసాగర్‌ చెరువులో జూన్‌ మొదటి వారం వరకు నీటి నిల్వలు ఉన్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరిగితే చెరువులో నీళ్లు ఆవిరయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అక్కడి నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి, ఫిల్టర్‌ బెడ్ల ద్వారా నగరానికి అయ్యే నీటి వాటా సరఫరా తగ్గనుంది. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి పలు కాలనీలకు ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. రానున్న రోజుల్లో తాగునీటి గండం పెరిగే అవకాశం ఉన్నందున పాలకవర్గం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

వరంగల్‌ సమ్మయ్యనగర్‌లో

సన్నటి ధారతో పోస్తున్న నల్లా

లీకేజీలను అరికట్టాలి..

ఓవర్‌హెడ్‌ ట్యాంకుతోపాటు పైప్‌ లైన్లు, గేట్‌వాల్వ్‌ల లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. ఎగువ ప్రాంతాలకు అందడం లేదు. మున్సిపల్‌ అధికారులు స్పందించి లీకేజీలన్నింటికి మరమ్మతులు చేయించాలి. రెండు, మూడు రోజులకోసారి కాకుండా రోజూ తాగునీటిని విడుదల చేయాలి.

– నాగేశ్వర్‌రావు, కాజీపేట

అడుగున మట్టి పేరుకుంటోంది..

తాగునీటిని పట్టుకున్నాక, గంట తర్వాత చూస్తే బిందె అడుగున మట్టి పేరుకుంటోంది. నల్లా నీటిని పట్టుకునేప్పుడు ఎంత వడగట్టినప్పటికీ మట్టి పేరుకుపోతోంది. తాగాలంటే భయమేస్తోంది. మినరల్‌ వాటర్‌ క్యాన్‌ కొనుక్కోవాల్సి వస్తోంది.

– తోహెద, న్యూరాయపుర, హనుమకొండ

తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం..

తాగునీటి కోసం అరిగోస పడుతున్నాం. పైపులైన్‌ ద్వారా రెండ్రోజులకోసారి రెండు బిందెల కన్నా ఎక్కువ రావడం లేదు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికారులు సమయానికి ఎక్కువసేపు నీరు విడుదల చేయాలి. – కీసర లక్ష్మి, విద్యానగర్‌ కాలనీ, వరంగల్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

గ్రేటర్‌ వరంగల్‌ నగర ప్రజలకు తాగునీటి గండం పొంచి ఉంది. అడుగంటిన జలాశయాలు, భూగర్భజలాల కారణంగా నీటి తిప్పలు తప్పేట్లు లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోనూ భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. పూడికతీత కోసం వరంగల్‌ భద్రకాళి చెరువును ఆరు నెలల క్రితం ఖాళీ చేశారు. పూడికతీత పనులు నత్తనడకన సాగుతుండగా.. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. పూడికతీత కోసం నీరు ఖాళీ చేయడంతో భద్రకాళి చెరువుపై ఆధారపడిన 150 కాలనీల్లో బోర్లు, బావులు ఎండిపోయాయి. హనుమకొండ పెద్ద వడ్డేపల్లి, కాజీపేట బంధం చెరువు, వరంగల్‌ దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువులో నీటి నిల్వలు తగ్గడంతో పాటు చుట్టు పక్కల కాలనీల్లో భూగర్భ జలమట్టం పడిపోతోంది. 42 విలీన గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

పైపులైన్‌ ద్వారా విడుదల చేయాలి..

వరంగల్‌ 34వ డివిజన్‌ శివనగర్‌లో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణంతో ప్రధాన పైపులైన్ల ధ్వంసమయ్యాయి. తాగునీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. స్థానిక ప్రజా ప్రతినిధికి విన్నవించుకున్నాం. తాత్కాలికంగా వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పైపులైన్ల మరమ్మతులు చేసి తాగునీటిని పునరుద్ధరించాలి.

– బత్తుల సంధ్యారాణి, 34వ డివిజన్‌, శివనగర్‌, వరంగల్‌

న్యూస్‌రీల్‌

ట్యాంకర్ల ద్వారా సరఫరా..1
1/7

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

ట్యాంకర్ల ద్వారా సరఫరా..2
2/7

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

ట్యాంకర్ల ద్వారా సరఫరా..3
3/7

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

ట్యాంకర్ల ద్వారా సరఫరా..4
4/7

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

ట్యాంకర్ల ద్వారా సరఫరా..5
5/7

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

ట్యాంకర్ల ద్వారా సరఫరా..6
6/7

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

ట్యాంకర్ల ద్వారా సరఫరా..7
7/7

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement