హనుమకొండ జిల్లా జడ్జి పట్టాభిరామారావు బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

హనుమకొండ జిల్లా జడ్జి పట్టాభిరామారావు బాధ్యతల స్వీకరణ

Apr 24 2025 1:44 AM | Updated on Apr 24 2025 1:44 AM

హనుమకొండ జిల్లా జడ్జి పట్టాభిరామారావు  బాధ్యతల స్వీకరణ

హనుమకొండ జిల్లా జడ్జి పట్టాభిరామారావు బాధ్యతల స్వీకరణ

వరంగల్‌ లీగల్‌ : హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ పట్టాభిరామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, రవి నేతృత్వంలో కా ర్యవర్గం.. న్యాయమూర్తి పట్టాభి రామారావు కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

వేయిస్తంభాల ఆలయంలో పూజలు

హన్మకొండ కల్చరల్‌: హనుమకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.పట్టాభి రామారావు బుధవారం రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని ఆయన కుటుంబసమేతంగా సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. న్యాయమూర్తి దంపతులు స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ ఈఓ అనిల్‌కుమార్‌, సిబ్బంది మధుకర్‌, అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ పాల్గొన్నారు.

బాధ్యతాయుతంగా

విధులు నిర్వహించాలి..

హన్మకొండ చౌరస్తా: ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు శ్రద్ధతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ సూచించారు. హనుమకొండలోని పోలీస్‌ కమిషనరేట్‌లో ఆర్ముడ్‌ రిజర్వ్‌ పోలీస్‌, హోంగార్డులతో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్విహించారు. ఈసమావేశంలో ముందుగా సిబ్బంది శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సిబ్బంది సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పరిపాలనా విభాగాధికారులను అడిగి తెలుసుకుని, సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌ విభాగంలో ఆర్ముడ్‌ రిజర్వ్‌ సిబ్బంది చాలా కీలకమన్నారు. మీకు శాఖాపరమైన లేదా వ్యక్తిగత సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీలైనంత వరకు సదరు అధికారులు సమస్యలు పరిష్కరిస్తారని, పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటారని సూచించారు. ఈసమావేశంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్‌, ఏఎస్పీ మనన్‌భట్‌, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, నాగయ్య, అనంతయ్య, సురేంద్ర, ఆర్‌లు పాల్గొన్నారు.

జూన్‌ 6నుంచి పీజీ సెకండి

యర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పీజీ కోర్సుల (నాన్‌ప్రొఫెషనల్‌) సెకండియర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు (రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) జూన్‌ 6వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాఽధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య బుధవారం తెలిపారు. ఈనెల 26 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. రీషెడ్యూల్‌ చేస్తూ బుధవారం టైంటేబుల్‌ను విడుదల చేశారు. జూన్‌ 6, 9, 11, 13, 16, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల పరీక్షలు వరకు నిర్వహిస్తారని వారు తెలిపారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

విద్యార్థుల్లో జాతీయ

భావం పెంచాలి

విద్యారణ్యపురి: విద్యార్థుల్లో జాతీయ భావం పెంచాలని జిల్లా సెక్టోరియల్‌ అధికారి బద్దం సుదర్శన్‌రెడ్డి అన్నారు. ‘ఏక్‌భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌’ ఛాయ చిత్ర ప్రదర్శనను హనుమకొండలోని జూలైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆపాఠశాల హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డితో కలిసి సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మణసుధాకర్‌, ప్రేమలతారెడ్డి, అపూర్వరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement