నెహ్రూనగర్: గుంటూరు కథోలిక పీఠాధిపతులుగా డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య బాధ్యతలు స్వీకరించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం గుంటూరు నగరంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫాదర్లు మోన్సిగ్నోర్ అల్లం శౌరెడ్డి, మోన్సిగ్నోర్ పామిశెట్టి బాలస్వామి, మోన్సిగ్నోర్ చాట్ల మరియదాసు, పూదోట దానయ్య, దాసరి కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు రింగ్ రోడ్డులోని బిషప్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద నుంచి బిషప్ హౌస్ వరకు ప్రదక్షిణ (ఊరేగింపు) ప్రారంభం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు డాన్బాస్కో మైదానంలో ప్రత్యేక దివ్యబలి పూజ సమర్పించనున్నట్లు వివరించారు. అనంతరం బిషప్ భాగ్యయ్యకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతి, భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని హాజరుకానున్నారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు బిషప్లు, గురువులు, కన్యాసీ్త్రలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొంటారని వివరించారు.


