భూ సమీకరణకు 14.36 ఎకరాలు అందజేత | - | Sakshi
Sakshi News home page

భూ సమీకరణకు 14.36 ఎకరాలు అందజేత

Sep 4 2026 2:30 AM | Updated on Sep 4 2026 2:30 AM

భూ సమీకరణకు 14.36 ఎకరాలు అందజేత 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత సౌత్‌ జోన్‌ షూటింగ్‌ పోటీలలో మెరిసిన షూటర్లు గుంటూరు వెస్ట్‌(క్రీడలు): కేరళంలోని త్రివేండ్రంలో గత నెల 31 నుంచి ఈనెల 8వరకు జరుగుతున్న 17వ సౌత్‌ జోన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ది ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ షూటింగ్‌ స్పోర్ట్‌కి చెందిన షూటర్లు పలు పతకాలు సాధించారని అకాడమీ డైరెక్టర్‌, చీఫ్‌ కోచ్‌ నాగిశెట్టి సుబ్రహ్మణ్య్వేశ్వర రావు గురువారం తెలిపారు. కొసన పూర్ణిమ శ్రీనివాస్‌ 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగం సీనియర్స్‌, జూనియర్‌, యూత్‌ విభాగాలలో మూడు రజతాలు కై వసం చేసుకోగా, కేవలం 12 సంవత్సరాల జాహ్నవి నాగిశెట్టి అద్భుతమైన ప్రతిభ కనుబరచి 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ ఫైర్‌ ఆర్‌మ్స్‌ సీనియర్‌, జూనియర్‌, యూత్‌ మహిళల విభాగంలో మూడు కాంస్య పతకాలు, ఏడూరు శ్రీకర జయంత్‌రెడ్డి 25 మీటర్ల జూనియర్‌, యూత్‌ మెన్‌ విభాగాలలో రెండు రజత పతకాలు కై వసం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు అకాడమీ షూటర్స్‌ మొత్తం 8 పతకాలు సాధించారని, ఈనెల 8 వరకు ఇంకా కొన్ని పోటీలు జరగాల్సి ఉందన్నారు.

తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్‌ పూలింగ్‌కు తుళ్లూరు బాలఏసు ఆంధ్రా క్యాపిచున్‌ సొసైటీ (ఏసీఎస్‌) తుళ్లూరు పరిధిలోని 14.36 ఎకరాలను ఇచ్చేందుకు సమ్మతించింది. ఏపీ సీఆర్‌డీఏకు ఇచ్చేందుకు ఈ మేరకు అంగీకార పత్రాలను సంబంధిత తుళ్లూరు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి. పద్మావతికి యూనిట్‌ కార్యాలయంలో గురువారం అందించారు. సొసైటీ తరఫున కాసు కరుణాకర్‌ రెడ్డి వాటిన అందజేశారు.

నలుగురిపై కేసు నమోదు

పెదకాకాని: రేషన్‌ షాపుల నుంచి అక్రమంగా తరలిస్తున్న 26 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు పౌర సరఫరాల విభాగం డిప్యూటీ తహసీల్దార్‌ దుర్గారావు, సిబ్బంది గురువారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టారు. తక్కెళ్ళపాడు నుంచి అశోక్‌ లేలాండ్‌ వాహనంలో తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్కార్ట్‌గా వెళుతున్న మరో వాహనాన్ని పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన పసుమర్తి వెంకట హనుమంతురావు, తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన భరత్‌, పెదకాకాని గ్రామానికి చెందిన నాగరాజు, వాహన డ్రైవర్‌ కుంభా నాగ తిరుపతిరావులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు గురువారం పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. వీరికి వెంకటకృష్ణాపురం రేషన్‌ డీలర్‌ చంద్రిక సహకరించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement