తాడికొండ: రెండో విడత భూ సమీకరణలో భాగంగా రైతులకు అవగాహన కల్పించాలని, ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. భూ సమీకరణపై సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షించారు. నోటిఫై చేసిన భూముల సమీకరణ ఆవశ్యమని, అందుకు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్లు ఎ.భార్గవ తేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్డీఓ కె.శ్రీనివాస రావు, తెనాలి ఆర్డీఓ కె.శ్రీరమణి, సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


