బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసే ఆధునిక వైద్య పద్ధతి అందుబాటులోకి వచ్చింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఈ విధానం ఒక వరం. గతంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలంటే తప్పనిసరిగా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి. లేకపోతే ఆపరేషన్ చేసినా ఫెయిల్ అవుతుంది. ‘ఇమ్యూనో ఎషరప్షన్’ అనే ఆధునిక వైద్య పద్ధతి ద్వారా గుంటూరు వేదాంత హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్నాం. స్వచ్ఛందంగా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలి.
– డాక్టర్ చింతా రామకృష్ణ, నెఫ్రాలజిస్టు, గుంటూరు


