గుంటూరు రూరల్: పొలం తాకట్టు వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన తెలిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. వెంగళాయపాలేనికి చెందిన చీలి రామారావు(60)కు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు ఉన్నారు. ఆయన 2006లో కొన్ని అవసరాల నిమిత్తం నల్లపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళాయపాలెంలోని 40 సెట్ల భూమిని తాకట్టు పెట్టారు. పొలం డబ్బు విషయంలో పలుమార్లు పోలీసులు, పెద్దలు జరుగుతున్న వివాదాలకు పలు మార్లు సెటిల్ మెంట్లు చేశారు. రామారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రామారావు కుటుంబ సభ్యులు పొలం తీసుకున్న వ్యక్తి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు పలువురు ఇరువురికి సర్ది చెప్పి పొలాన్ని విక్రయించి చెరిసగం తీసుకోవాలని నచ్చజెప్పారు. ఇరువర్గాలు అంగీకరించడంతో వివాదం సర్దుమణిగింది.


