వైఎస్ జగన్ పరిపాలనలో అట్టడుగు వర్గాలకు పెద్దపీట వైఎస్సార్సీపీ నేతలు అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, డైమండ్ బాబు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి
గుంటూరు ఎడ్యుకేషన్ : అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో ఆచరణలో పెట్టారని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవన్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. శనివారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)లతో కలసి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని, అణగారిన, అట్టడుగు వర్గాల్లో అంటరానితనాన్ని పారద్రోలి సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ముందుకు వెళ్లేందుకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. 1848లోనే సీ్త్ర విద్య కోసం తన సతీమణి సావిత్రిబాయి ఫూలేకు అండగా నిలిచి, ప్రత్యేకంగా విద్యాసంస్థలను స్థాపించేందుకు కృషి చేశారని అన్నారు. జ్యోతిరావు ఫులే ఆశించిన విధంగా అట్టడుగు వర్గాల సంక్షేమం, రాజకీయంగాచైతన్య, చట్టసభల్లో ప్రాధాన్యాన్ని వైఎస్ జగన్మోన్రెడ్డి గత ప్రభుత్వంలో ఆచరణలో చూపించారని అన్నారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన ఏకై క ముఖ్యమంత్రిగా నిలిచారని, రాష్ట్రంలో జ్యోతిరావ్ ఫులే ఆశయాలను ఆచరణలో పెట్టిన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ హక్కు ఉందన్నారు.
సామాజిక న్యాయాన్ని ఆచరణలో తెచ్చిన ఫులే
షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని ఆచరణలో తెచ్చిన జ్యోతిరావ్ పూలే సమ సమాజ నిర్మాతగా నిలిచారని అన్నారు. అందరికీ విద్యావకాశాలు, రాజ్యాధికారం, ఓటు హక్కు ఆయుధంగా, మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలనే నినాదంతో ఫులే గొప్ప సంస్కర్తగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని అన్నారు.
బీసీల సామాజిక అభ్యున్నతికి బాటలు
వనమా డైమండ్ బాబు మాట్లాడుతూ రెండు శతాబ్దాల కిందట జన్మించిన వ్యక్తిని తలచుకుని, ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం వెనుక ఆయన చేసిన గొప్ప పనులు కారణమని అన్నారు. బీసీలు సామాజికంగా ఎదగడంలో జ్యోతిరావ్ పూలే వేసిన పునాదులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని అన్నారు. పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వెనుక ఆయన వేసిన పునాది కారణమన్నారు. జ్యోతిరావ్ పూలే ఆశయాలను ఆచరణలో పెట్టి కార్పొరేషన్లలో పదవులు, 2019–24 మధ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు.


