మహిళా సాధికారత సాధ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారత సాధ్యం

Nov 26 2025 6:21 AM | Updated on Nov 26 2025 6:21 AM

మహిళా సాధికారత సాధ్యం

మహిళా సాధికారత సాధ్యం

● డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ లింగ వివక్ష అరికట్టడానికి సమాజంలో అవగాహన కోసం ప్రతిరోజు ఒక అంశంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థల్లో లింగ సమానత్వంపై అవగాహన కార్యక్రమాలు విస్తృత స్థాయిలో నిర్వహిస్తామన్నారు. గతంలో కంటే ఇప్పుడు మహిళలు మెరుగైన సమాజం ఉన్నప్పటికీ ఆర్థిక స్వాతంత్య్రం అనేది ఇంకా పూర్తిస్థాయిలో లేదన్నారు. ● తొలుత కలెక్టరేట్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంపాలెం సెంటర్లో మానవహారం నిర్వహించి జెండర్‌ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఈఓ రేణుక, ఐసీడీఎస్‌ పీడీ ప్రసునా, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ చెన్నయ్య, ఎస్‌ఈ కళ్యాణ చక్రవర్తి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఈఈ నజీమా బేగం, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

లింగ సమానత్వం ద్వారానే

డీఆర్‌ఓ ఖాజావలి

గుంటూరు వెస్ట్‌ : లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి షేక్‌ ఖాజావలి అన్నారు. మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని డీఆర్వో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై దాడులు అరికట్టడానికి, లింగ వివక్ష నిర్మూలనపై అవగాహన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో డిసెంబర్‌ 23వ తేదీ వరకు జిల్లా, మండల , గ్రామ స్థాయిలో మహిళా సాధికారతపై అవగాహన సదస్సులు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మహిళలపై వివక్ష లేకుండా సమాన అవకాశాలు కల్పించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి సీ్త్ర, పురుషులు సమానమని తెలియజేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement