
బాస్ లేని జిల్లా ఎస్బీ!
గుంటూరు
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
తమ్ముళ్ల చెరవు..!
ముప్పుతిప్పల ‘స్లాట్’
ఘనంగా అంకమ్మ తిరునాళ్ల
రొంపిచర్ల: బుచ్చి బాపన్నపాలెం గ్రామంలోని అంకమ్మ ఆలయ తిరునాళ్ల ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించారు. మహిళా భక్తులు పొంగళ్లు చేసి మొక్కు చెల్లించుకున్నారు.
మహంకాళి అమ్మవారికి విరాళం
దుగ్గిరాల: కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మ వారికి గుంటూరుకు చెందిన శ్రీ వసుధ డెవలపర్స్ రూ.1,00,116 విరాళం ఆదివారం అందజేసింది.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 514.40 అడుగుల వద్ద ఉంది. ఇది 139.2626 టీఎంసీలకు సమానం.
నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి ఎ.భార్గవ్ తేజ
నగరంపాలెం: డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారులు వీఆర్లోకి వెళ్లడం.. లేదా ఉద్యోగ విరమణ పొందడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. కొందరు డీఎస్పీలపై విమర్శలు వెల్లువెత్తడంతో సీఐలకు, కింది స్థాయి ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు దిశా నిర్దేశం చేసే వారు కనిపించడంలేదు.
కొరవడిన పర్యవేక్షణ..
జిల్లాలోని ఎస్బీ పోలీస్ శాఖకు మనిషికి ఆయువు వంటిది. అటువంటి ఎస్బీలో డీఎస్పీలు ఎక్కువ కాలం విధులు నిర్వర్తించలేకపోతున్నారు. కనీసం ఒక ఏడాదైనా ఉండటం లేదు. మూడు నుంచి ఐదారు నెలల వరకే పరిమితమవుతున్నారు. గతంలో విధుల్లో ఉన్న ఇద్దరు డీఎస్పీల పరిస్థితి అలాగే మారింది. అనధికార మామూళ్లు, సొంత సిబ్బంది నుంచే వసూళ్ల పర్వానికి పాల్పడటంతో అప్పటి ఎస్బీ సీఐ నరసింహారావును సస్పెండ్ చేశారు. డీఎస్పీ సుభాష్ను వీఆర్లోకి పంపించారు. ఆయన సుమారు ఆరు నెలలు మాత్రమే విధులు నిర్వర్తించారు. అనంతరం డీఎస్పీలుగా టీవీ రత్నస్వామి, పోతురాజు పనిచేశారు. వీరిలో ఒకరు మూడు, మరొకరు ఐదు నెలలు పని చేశారు. అంతలోనే వారిద్దరూ ఉద్యోగ విరమణ పొందారు. ఇక కొద్ది నెలలు డీఎస్పీ పోస్ట్ ఖాళీగా ఉంది. కొన్నాళ్లు సీఐలే జిల్లా అంతటా పర్యవేక్షణ చేపట్టారు.
మళ్లీ డీఎస్పీ పోస్టు ఖాళీ
కూటమి ప్రభుత్వ హయాంలో గతేడాది సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో ఎస్బీ డీఎస్పీగా బి.సీతారామయ్యను నియమించారు. ఆయన సుమారు ఎనిమిది నెలలు విధులు నిర్వర్తించారు. ఇటీవల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ వ్యవహారంలో తలెత్తిన పరిణామాల దృష్ట్యా డీఎస్పీ సీతారామయ్యను వీఆర్కు పంపించారు. ఇందులో డీఎస్పీని వీఆర్కు, ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, ఏఎస్ఐ, హెచ్సీ, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటుంచి డీఎస్పీ పోస్ట్కు ఖాళీ అయ్యింది. డీఎస్పీని నియమించాలంటే రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. దీంతో ఎస్బీలో ఉన్న సీఐలు మాత్రమే ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లను పర్యవేక్షణ చేస్తున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో..
జిల్లాలో నెలకొన్న పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగే ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు వంటి ముందస్తుగా సమాచారం సేకరించాల్సి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే నేరాల నియంత్రణకు సంబంధించి నిరంతర నిఘా ఉండాల్సిందే. వచ్చే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వచ్చే వీవీఐపీలు, వీఐపీలు ఇతరత్రా ప్రముఖుల రాకతో మౌలిక సౌకర్యాల కల్పనపై తర్జనభర్జన పడుతున్నారు. ఐపీఎస్ అధికారులు, ఇతరత్రా బలగాలు ఉన్నప్పటికీ ఎస్బీకి సమర్థ డీఎస్పీని నియమించాల్సిన అవసరం ఉంది.
పోలీస్ శాఖకు స్పెషల్ బ్రాంచి (ఎస్బీ) కీలకం. ముందస్తు సమాచారం చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. ఆ విభాగం వారిచ్చే సమాచారంతో నేరాల నియంత్రణ చేసేందుకు అవకాశాలెక్కువ. పోలీస్ ఉన్నతాధికారులు సైతం నిఘా వ్యవస్థ అందించే సమాచారంతోనే ముందుకెళ్తారు. అటువంటి ఎస్బీ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. గడిచిన రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది.
పాలకుల శీతకన్ను..
7
న్యూస్రీల్
మేయర్ ఎన్నిక ఏర్పాట్ల పరిశీలన
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు సోమవారం జరగనున్న ప్రత్యేక సమావేశానికి సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. మేయర్ ఎన్నిక జరిగే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాట్లను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, కౌన్సిల్ సెక్రెటరీ బి.శ్రీనివాసరావు, డీఎస్పీ అజీజ్, లాలాపేట సీఐ శివ ప్రసాద్లతో కలిసి పరిశీలించారు. పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నిక ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 10:30 గంటలకు తమ గుర్తింపు కార్డులతో హాజరు కావాలని తెలిపారు. సభ్యులు మినహా ఇతరులను అనుమతించబోమని తెలిపారు. మొబైల్ ఫోన్లకు కూడా అనుమతి లేదన్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ర్యాలీలు, గుంపుగా రావడానికి వీలు లేదని చెప్పారు. తగిన చర్యలను జీఎంసీ, పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
గత రెండేళ్లుగా కానరాని సరైన సారథి
వీఆర్లు, ఉద్యోగ విరమణ వైపు మొగ్గు
అరకొరగానే ముందస్తు
సమాచారం సేకరణ
కీలకమైన రాజధాని జిల్లా
గుంటూరులో ఇదీ పరిస్థితి
ఎస్బీ డీఎస్పీ పరిధిలో గుంటూరు పశ్చిమ, తూర్పు, దక్షిణ, ఉత్తర, తెనాలి, మంగళగిరి సబ్ డివిజన్లు ఉన్నాయి. జిల్లాలో రాష్ట్ర రాజధాని ఉంది. అసెంబ్లీ, హైకోర్టు కూడా ఇక్కడే కొలువుదీరాయి. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఎక్కువగా ఇక్కడే ఉంటారు. ఇటువంటి తరుణంలో ఎక్కడ ఏం జరుగుతోందనే ముందస్తు సమాచారం సేకరణలో సమర్థమైన గ్రూప్–1 డీఎస్పీని నియమించాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని గుంటూరు పశ్చిమ, తూర్పు సబ్ డివిజన్ డీఎస్పీ పోస్ట్లపై ఉన్న మక్కువ ఎస్బీ డీఎస్పీ పోస్ట్పై ఉన్నతాధికారులకు లేదు. దీంతో ముందస్తు సమాచారం సేకరణలో కొంతమేర అలస్యమవుతుందనే ఆరోపణలు లేకపోలేదు.

బాస్ లేని జిల్లా ఎస్బీ!

బాస్ లేని జిల్లా ఎస్బీ!

బాస్ లేని జిల్లా ఎస్బీ!

బాస్ లేని జిల్లా ఎస్బీ!

బాస్ లేని జిల్లా ఎస్బీ!

బాస్ లేని జిల్లా ఎస్బీ!

బాస్ లేని జిల్లా ఎస్బీ!