
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తెనాలి అక్కా
తెనాలి: పట్టణానికి చెందిన అక్కాచెల్లెళ్లు యండ్రపాటి నయనశ్రీ, యండ్రపాటి మోనిక గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. గతేడాది డిసెంబరు ఒకటిన హలెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా ప్రపంచస్థాయిలో 18 దేశాల నుంచి 1100 మంది విద్యార్థులు సంగీత ప్రదర్శనలో పాల్గొన్నారు. కీ బోర్డు వాయిద్యంతో ఇచ్చిన ప్రదర్శనలో నయనశ్రీ, మోనికతో పాటు మొత్తం 1046 మందిని ఎంపికచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ చర్చిలో శుక్రవారం జరిగిన అభినందన సభలో మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుడు అగస్టీన్ దండింగ చేతుల మీదుగా వీరిరువురు గిన్నిస్ సర్టిఫికెట్, జ్ఞాపికను అందుకున్నాడు. వీరి తల్లిదండ్రులు యండ్రపాటి రత్నం, సువర్ణ దంపతులు.
కీబోర్డ్ ప్లేలో గిన్నిస్ రికార్డు
గుంటూరు రూరల్: తమ కళాశాల విద్యార్థులు విద్యతోపాటుగా అన్నిరంగాల్లో ప్రావీణ్యతను పెంపొందించేందుకు అన్నివిధాలుగా తమ కళాశాల సౌకర్యాలను కల్పిస్తుందని విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాధిక తెలిపారు. శనివారం పెదపలకలూరురోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థిని వై.నయనశ్రీ కీబోర్డ్ ప్లేలో గిన్నిస్ రికార్డు సాధించినట్లు తెలిపారు. హాల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో గత డిసెంబరు 15వ తేదీన ఆన్లైన్ మాధ్యమంలో పోటీ నిర్వహించగా 18 దేశాలకు చెందిన పియానో వాయిద్యకారులు పాల్గొన్నారని, వారిలో కుమారి నయనశ్రీ కేవలం 41 సెకండ్లలో మూడు సరళీ స్వరాలు వాయించినందుకు ఈ అరుదైన రికార్డు లభించినట్లు తెలిపారు. ఈమేరకు ఫలితాలు వెల్లడి చేసి ఈనెల 25వ తేదీన గిన్నిస్ రికార్డు పత్రాన్ని విద్యార్థినికి పంపించారన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ జి.సంధ్య, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తెనాలి అక్కా