కొనసాగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

Apr 13 2025 1:56 AM | Updated on Apr 13 2025 1:56 AM

కొనసా

కొనసాగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

పర్చూరు(చినగంజాం): బాపట్ల జిల్లా ఉప్పుటూరులో రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జోరుగా సాగుతున్నాయి. గ్రామంలోని వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి వార్ల తిరునాళ్లను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి పోలురాధ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. క్వింటాన్నర ఇసుక బస్తాలతో కూడిన చక్రాలు తిరగని ఎడ్ల బండిని పది నిమిషాల్లో ఎక్కువ దూరం లాగిన జతను విజేతగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. పందాల్లో గెలిచిన ఎడ్ల జతలకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు బహుమతులుంటాయని వివరించారు. పోటీలలో రెండవ రోజు జూనియర్స్‌ విభాగంలో 18 ఎడ్ల జతలు పాల్గొన్నట్లు వారు తెలిపారు.

సారా జోలికి వస్తే

జిల్లా బహిష్కరణ

బాపట్ల టౌన్‌: నాటుసారా తయారు చేసినా..విక్రయించినా అలాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదుచేసి వారిని జిల్లా బహిష్కరణ చేస్తామని ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.విజయ హెచ్చరించారు. శనివారం మండలంలోని వెదుళ్లపల్లి, బేతపూడి గ్రామాల్లో నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. కె.విజయ మాట్లాడుతూ పదేపదే నాటుసారా తయారుచేస్తూ పట్టుబడిన వారిని ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా బహిష్కరణ చేసేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. నాటుసారా తయారీకి ముడి సరుకు సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రకాశం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎ.జనార్దనరావు, బాపట్ల ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లు, బాపట్ల ఎకై ్సజ్‌ సీఐ పి.గీతిక, ఎస్‌ఐలు ప్రభుదాస్‌, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.

కొనసాగుతున్న  ఎడ్ల బల ప్రదర్శన పోటీలు 
1
1/1

కొనసాగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement