
అవిసె గింజల్లో...35శాతం నూనె, 20 శాతం ప్రొటీన్..!
అవిసె గింజలను సూపర్ ఫుడ్గా, ఫంక్షనల్ ఫుడ్గా చెబుతారు. అంటే.. ఈ గింజలు పోషకాహారంగా మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్న మాట. సాధారణ ధాన్యాలు కేవలం ఆకలిని తీర్చటానికే పరిమితమవుతాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ పశ్చిమబెంగాల్ బారక్పూర్లోని కేంద్రీయ జనపనార, ఇతర నార ఉత్పత్తుల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్) శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం అవిసె గింజల్లో పోషక, ఔషధ విలువలు ఇలా ఉన్నాయి: అవిసె గింజల్లో 35–43% కొవ్వు ఆమ్లాలు, 18–21% మాంసకృత్తులు, 25–28% డయటరీ ఫైబర్, 1–2% పిండిపదార్థాలు ఉంటాయి. ఒమెగా 3 కొవ్వు ఆమ్లం, ఎఎల్ఎ, లినోలీక్ ఆమ్లం(ఎల్ఎ), ఎసెన్షియల్ విటమిన్లు, అమినో ఆమ్లాలు, స్థూల–సూక్ష్మ మూలకాలు, లిగ్నాన్లు, ఫ్లావనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అత్యధిక మొత్తంలో పాఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (పీయూఎఫ్ఏలు), ముఖ్యంగా ఎఎల్ఎలు, ఉంటాయి కాబట్టి అవిసె గింజలు ఆరోగ్యదాయకమైన అనుబంధాహారంగా ప్రాచుర్యం ΄పొందాయి.. ఎఎల్ఎ, లిగ్నాన్లు పుష్కలంగా ఉండటం మూలంగా అవిసె గింజలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ను నిరోధిస్తాయి.
మెనోసాజ్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్దకం, మానసిక అలసటను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. అవిసె గింజల పిండిని అనేక అనారోగ్యాలను తగ్గించడానికి అనాదిగా వాడుతున్నారు. అయితే, శ్యానోజెనిక్ గ్లైకోసైడ్స్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్, ఫైటిక్ ఆసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్లు ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెరవేరతాయి. అందువల్లనే అవిసె గింజలు ఔషధగుణాలున్న పోషక గింజలుగా ప్రసిద్ధి పొందుతున్నాయి.
అవిసె నార ఉత్పత్తి కన్నా అవిసె గింజల ఉత్పత్తికి మన దేశ వాతావరణం అనుకూలమైనదని ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరప్ దేశాల నుంచి అవిసె గింజలను దిగుమతి చేసుకోవటం వల్ల విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశం నష్ట΄ోతోంది. ఓఈసీ గణాంకాల ప్రకారం భారత్ ఫ్లాక్స్ ఫైబర్ దిగుమతులు 2016లో 3.15 కోట్ల డాలర్ల నుంచి 2021 నాటికి 9.45 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఫ్లాక్స్ ఫైబర్ను మనం పండిస్తున్న దానికీ, మన అవసరాలకు పెద్ద అగాధం ఉంది. అంటే, ఫ్లాక్స్ ఫైబర్ సాగును దేశీయంగా పెంచుకోవటానికి గల అవకాశాలను ఇది సూచిస్తోంది. అయితే, గింజల కోసం ఒక పంట, నార కోసం మరో పంట కాకుండా.. రెండిటి కోసమూ ఒకే పంటను పండించుకుంటే ఈ కొరతను తీర్చుకోవటం వీలవుతుంది. భారతీయ పరిస్థితులకు తగిన మేలైన నార అవిసె రకాలను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఫ్లాక్స్ ఫైబర్ ఉత్పత్తిలో మనం స్వయంసమృద్ధి సాధించవచ్చు. ఈ సవాలును అధిగమించేందుకు అనువైన వంగడాలను 2015లోనే జెఆర్ఎఫ్–2 (తైర)ను ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. సాగు పెంచాలంటే చెయ్యాల్సిన మరో పని ఏమిటంటే.. మన దేశంలో వేడిగా, తేమగా ఉండే వాతావరణాల్లో చక్కగా పెరిగే అవిసె నార పంట సాగుకు అనువైన వంగడాలను రూ పొందించుకోవటం ముఖ్యం.
రైతులు తొలిగా సాగు చేసిన పంటల్లో ఒకటైన అవిసెకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈ గింజలతో వంట నూనె తయారు చేసుకోవచ్చు. ఔషధ గుణాలతో కూడిన ఆహారోత్పత్తులు చేసుకోవచ్చు. గానుగ పిండి పశుదాణాగా పనికొస్తుంది. కాండం పీచుతో వస్త్రాలను తయారు చేసుకోవచ్చు. ప్రపంచ అవిసె ఉత్పత్తి గతంలో కన్నా క్షీణించినప్పటికీ.. దీని సహజ ఆరోగ్యకర ఉత్పత్తుల ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై పెరిగిన అవగాహన వంటి కారణాల రీత్యా అవిసె పంట తిరిగి పుంజుకోవడానికి అవకాశాలున్నాయి. ఉన్నతమైన అవిసె వంగడాలను అభివృద్ధి చేయడానికి అధునాతన బయోటెక్నాలజీ పద్ధతులను శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో అవిసె ‘అద్భుత పంట’గా తన ఖ్యాతిని మరింత మిన్నగా కొనసాగిస్తుందని ఆశిద్దాం.
అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ 2021 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల డాలర్ల లిన్సీడ్ వాణిజ్యం జరిగింది. రష్యా, కెనడా, కజకిస్తాన్ ఎగుమతిలో ముందంజలో ఉన్నాయి. బెల్జియం, చైనా, అమెరికా ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. 2021లో మన దేశం 1.35 కోట్ల డాలర్ల అవిసె గింజలను ఎగుమతి చేసింది. ప్రపంచ మార్కెట్లో ఇది 1%. అదే సంవత్సరం 1.53 లక్షల డాలర్ల విలువైన అవిసె గింజలను విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. 2021లో 98.5 కోట్ల డాలర్ల ముడి అవిసె నార వాణిజ్యం జరిగింది. ఫ్రాన్స్, బెల్జియం, అమెరికా, బెలారస్ ఎక్కువగా ఎగుమతి చేశాయి. చైనా, బెల్జియం, భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి.
చదవండి: లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్ : అవిసె గింజలు అద్భుతః
అవిసె నార ఉత్పత్తి కన్నా అవిసె గింజల ఉత్పత్తికి మన దేశ వాతావరణం అనుకూలమైనదని ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరప్ దేశాల నుంచి అవిసె గింజలను దిగుమతి చేసుకోవటం వల్ల విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశం నష్ట΄ోతోంది. ఓఈసీ గణాంకాల ప్రకారం భారత్ ఫ్లాక్స్ ఫైబర్ దిగుమతులు 2016లో 3.15 కోట్ల డాలర్ల నుంచి 2021 నాటికి 9.45 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఫ్లాక్స్ ఫైబర్ను మనం పండిస్తున్న దానికీ, మన అవసరాలకు పెద్ద అగాధం ఉంది. అంటే, ఫ్లాక్స్ ఫైబర్ సాగును దేశీయంగా పెంచుకోవటానికి గల అవకాశాలను ఇది సూచిస్తోంది. అయితే, గింజల కోసం ఒక పంట, నార కోసం మరో పంట కాకుండా.. రెండిటి కోసమూ ఒకే పంటను పండించుకుంటే ఈ కొరతను తీర్చుకోవటం వీలవుతుంది. భారతీయ పరిస్థితులకు తగిన మేలైన నార అవిసె రకాలను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఫ్లాక్స్ ఫైబర్ ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఈ సవాలును అధిగమించేందుకు అనువైన వంగడాలను 2015లోనే జెఆర్ఎఫ్–2 (తైర)ను ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. సాగు పెంచాలంటే చెయ్యాల్సిన మరో పని ఏమిటంటే.. మన దేశంలో వేడిగా, తేమగా ఉండే వాతావరణాల్లో చక్కగా పెరిగే అవిసె నార పంట సాగుకు అనువైన వంగడాలను రూపొందించుకోవటం ముఖ్యం.
ఇదీ చదవండి: ప్రియుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కానీ..రేర్ కేన్సర్ కబళించింది!
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షిసాగుబడి డెస్క్