
జీవితాన్ని గ్రంథాలయోద్యమానికి ధారపోసిన గ్రంథాలయ సారథి, పుస్తక సంపాదకుడు, బాలసాహితీవేత్త, ఎందరో బాల సాహితీవేత్తలను ప్రోత్సహించి, వారు పుస్తకాలు రాసే అవకాశం కల్పించిన సహృదయుడు, ‘గ్రంథాలయ గాంధీ’ వెలగా వెంకటప్పయ్య (Dr. Velaga Venkatappaiah) గ్రంథాలయ గాంధీ . జూన్ 12వ తేదీన వీరివర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో ఆయనకాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలు యువతకు తెలియవల సిన అవసరం ఎంతైనా ఉంది. 1932లో తెనాలి ఐతానగర్లో జన్మించారు. గ్రంథాలయంలో చిరుద్యోగిగా జీవితం ఆరంభించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పొందిగ్రంథాలయ శాఖలో వివిధ పదవులు నిర్వహించారు.
17 ఏళ్ల వయస్సులోనే 1949లో ‘బంగారు బొమ్మ’ పేరుతో బాలల కథల సంపుటిని ప్రచురించి పిల్లలకు అందించారు. పిల్లల కోసం 1958లో ‘టెలిఫోన్’, 1959లో ‘రేడియో’, 1962లో ‘కాగితం కథ’ వంటి పుస్తకాలు రాశారు. 30 వేల తెలుగు సామెతలు, వేయి తెలుగు బాలల జానపద గేయాలు, 3 వేల పొడుపు కథలు, 15 వేల జాతీయాలు సేకరించి ప్రచురించారు. 2013లో ‘అందరూ మహానుభావులే’ పేరుతో 1024 పేజీలతో అన్ని రంగాల ప్రముఖుల పరిచయాలతో కూడిన బృహత్తరగ్రంథానికి సంపాదకత్వం వహించారు.
2014లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాలసాహిత్య కథల సంకలనానికి సంపాదక బాధ్యతలు వహించారు. గ్రంథాలయ విజ్ఞానంలో ఆయన తాకని అంశం లేదు. వందకు పైగా పుస్తకాలు, ముఖ్యంగా గ్రంథాలయ విజ్ఞానానికి సంబంధించి రాసినగ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. వీరు కాకతీయ విశ్వవిద్యాలయా నికి సర్టిఫికెట్ కోర్సుకు ఆరు పుస్తకాలు, డిగ్రీకి 12 పుస్తకాలు రాశారు. 1990లో ఉద్యోగ విరమణ చేసి రచనా వ్యాసంగంలోనే నిమగ్నమయ్యారు. 2013లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని గ్రంథా లయ రంగం నుండి అందుకున్న తొలి వ్యక్తి డా‘‘ వెలగా. జీవిత కాలాన్ని గ్రంథాలయ ఉద్యమాలు, బాల సాహిత్యం కోసం అంకితం చేసిన వెలగా వెంకటప్పయ్య తన 82వ ఏట 2014 డిసెంబర్ 29న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన సేవలు చిరస్మరణీయాలు.
– షేక్ అబ్దుల్ హకీం జాని, తెనాలి
(రేపు తెనాలిలో డా‘‘ వెలగా వెంకటప్పయ్య కాంస్య విగ్రహ ప్రతిష్ఠ)